Sunday, September 8, 2024

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కుల నిర్వహణ చేయండి

- Advertisement -

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కుల నిర్వహణ చేయండి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
కమిషనర్ అదితి సింగ్
తిరుపతి ,

Manage parks to provide enjoyment to people

నగరంలోని పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించేలా నిర్వహణ ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని చేప మార్కెట్, శంకర్ కాలని, మధురా నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, తిరుమల బైపాస్ రోడ్డులో గల ప్రకాశం పార్కును హెల్త్, ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, పార్కుల నిర్వహణ సరిగా లేకపోవడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి నిర్వహణ లోపం తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదం కొరకు పార్కుకు వస్తారని, నగరంలోని పార్కులు శుభ్రంగా ఉండాలని  అన్నారు. చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని అన్నారు. మరుగుదొడ్లు నిర్వహణ బాగుండాలని అన్నారు. పార్కుల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే నిర్వహణ సరిగా లేదని పలువురు వాకర్లు పిర్యాదు చేయడంతో, రిజిస్టర్ పరిశీలించి విధులకు సక్రమంగా హాజరు కాని వారికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు మధురా నగర్  తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు బాగా చేపట్టాలని, అంటురోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామి రెడ్డి, డి. ఈ లు విజయకుమార్ రెడ్డి, శ్రావణి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, డి.సి.పి. శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్