వింటేజ్ హోటల్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

వింటేజ్ హోటల్ ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
నల్గోండ

Minister Komatireddy inaugurates Vintage Hotel
నల్లగొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద హోటల్ వింటేజ్  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ  ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సదుపాయాలతో హైదరాబాద్ పెద్ద పెద్ద జిల్లాల స్థాయిలో ఉండే మెరుగైన సదుపాయాలతో హోటల్ వింటే ప్రారంభించడం సంతోషకరమని అన్నారు.  హోటల్ నిర్వాహకులు ఫాజిల్, ఆదిల్ బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
హోటల్ ఏర్పాటు చేయడమే కాదు ప్రజల ఆరోగ్య దృష్టిలో ఉంచుకొని మంచి శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు..  హోటల్ ప్రాంగణం ముందుగాల చార్మినార్ నమూనా ఎంతగానో ఆకట్టుకుంటుందని అదేవిధంగా ఈ హోటల్లో ఫ్యామిలీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి రూములు పార్టీ చేసుకోవడం కోసం ఏర్పాటు చేయడం మంచి అభిప్రాయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్  జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య,  డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, సమద్, అజిజుద్దీన్ బషీర్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular