Sunday, September 8, 2024

సివిల్ సప్లయ్ శాఖ అవినీతి, అక్రమాలపై మొహం చాటేసిన మంత్రి ఉత్తమ్ :ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- Advertisement -

సివిల్ సప్లయ్ శాఖ అవినీతి, అక్రమాలపై మొహం చాటేసిన మంత్రి ఉత్తమ్
  ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నాపై కేసు పెట్టిస్తారా…?
సివిల్ సప్లయ్ శాఖలో జరిగే  అవినీతి, అక్రమాలపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి
 మంత్రి గారు చర్చకు వస్తె నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం
ఇదేనా ప్రజా పాలన..నిప్పులు చెరిగిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ మే 23
సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై మాటాడితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశాడని  బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్చించారు.గురువారం బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మేదియసమావేశం లో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయించి నాపై కేసు పెట్టిస్తారా…?ఇదేనా ప్రజా పాలన అని నిలదీశారు.సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతిపై నేను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు.కాళేశ్వరంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించిన ప్రభుత్వం, సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాట్లాడేందుకు సమాధానం లేక అధికారులతో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడని కాని మీరు నా ఆరోపణలను ఎలా రెక్టిఫై చేస్తారో చెప్పాలన్నారు.అలాంటిది కేసులు పెట్టి మొహం చాటేస్తున్నారు జగ్గారెడ్డి కి సివిల్ సప్లై శాఖ పై ఏం అవగాహన ఉంటుందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.నేను బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా సివిల్ సప్లై శాఖ లో అవినీతిని బయటపెట్టాను దానికి సమాధానం చెప్పకుండా పోలీసు కంప్లైంట్ లతో , అధికారుల స్టేట్మెంట్ తో సమాధానం దొరకదన్నారు.25 జనవరి న టెండర్ల కోసం కమిటీ వేశారు గైడ్ లైన్స్ కూడా ప్రిపేర్ చేశారు అదేరోజు గ్లోబల్ టెండర్లనుకు ప్రకటన చేశారు.ఒక్క రోజులోనే కమిటీ ఏర్పాటు, మీటింగ్స్, గైడ్ లైన్స్ రూపకల్పన, అదే రోజు టెండర్లకు ప్రకటన ఎలా సాధ్యం.ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ కోసం మరో గైడ్ లైన్స్ తయారు చేశారు టెండర్ లలో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి కాంట్రాక్టర్లు ముందుకు వస్తే, కొందరు అధికారులు వారిని బెదిరించారన్నారు.ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే…ఏప్రిల్ 18న హైదరాబాద్ లోని జలసౌలో రైస్ మిల్లర్లతో సమావేశంలో ఒప్పందాలు చేసుకున్నారు.ఎవరిని వ్యక్తిగతంగ కార్నర్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపైనే ప్రశ్నిస్తున్నాను.రూ. 216రూపాయలు అదనంగా మిల్లర్ల నుంచి వసూలు చేసింది నిజం కాదా స్థాయి కి మించి అధనపు ధాన్యం మిల్లర్ల కు ఇస్తే వారు ఎలా భరిస్తారుమిల్లర్లు బియ్యం ఇస్తామంటే డబ్బు లే ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.మిల్లర్లతో మీరు బెదిరింపులకు పాల్పడింది నిజం కాదా జలసౌధాలో మీరు చేసిన అరాచకాలు బయటపెట్టాలాప్రజల కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా భయపడేది లేదు ప్రజాసేవమీద మక్కువతో ఆస్తులు అమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చాను సమాధానం చెప్పాల్సిన మంత్రి నాపై కేసులు పెట్టడం దారుణంప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొంటం.23మే లోపు పూర్తి మెటీరియల్ లిఫ్ట్ చేయాలని టెండర్ లో కోరారు పూర్తి ధాన్యం లిఫ్ట్ చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు ధాన్యం కొనుగోలు లో రూ. 800కోట్ల రూపాయల అవినీతి జరిగిందినేటితో కాంట్రాక్టర్ కు ఇచ్చిన గడువు కూడా ముగిసింది అయినా…కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మే 23తో గడువు ముగిసి, పూర్తి ధాన్యం కొనుగోలు చేయని బిడ్డర్ లకు ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. రూ. 2259రూపాయలకు లక్షా 59వేల మెట్రిక్ టన్నుల బియ్యం అమ్మేశారు మధ్యాహ్న భోజనం, హాస్టల్ లలో విద్యార్థుల కోసం అంటూ మళ్ళీ ఎందుకు కొంటున్నారు క్వింటకు రూ. 5700లకు తిరిగి సన్నబియ్యం ఎందుకు కొన్నారు22లక్షల క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేశారు 10శాతం నూక ఉన్న బియ్యం ఓపెన్ మార్కెట్ లో రూ.38 రూపాయలకే దొరుకుతుంది ఇంత వ్యత్యాసం తో ఎందుకు అమ్మారు.. ఇప్పుడు ఎందుకు మళ్ళి అధిక ధరకు కొంటున్నారాణి ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ శాఖలో ఇలా జరిగిన ఎన్నో అవినీతి, అక్రమాలపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మంత్రి గారు చర్చకు వస్తె నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్