- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తరువాత మల్లారెడ్డి మట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించడం జరిగింది. కేసీఆర్ గారి ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకోవడం జరిగిందని అన్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- Advertisement -