- Advertisement -
వరంగల్: కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భేటీ కావడం చర్చనీయాంశమయింది. నగరంలోని ఒక హోటల్ లో రహస్యంగా రాజనర్సింహ, రాజయ్య సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో రాజయ్యఅసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. రాజయ్య కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం కుడా జరుగుతోంది. రాజనర్సింహతో రాజయ్య భేటీ కావడంతో స్టేషన్ ఘన్ పూర్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి

- Advertisement -



