Sunday, September 8, 2024

గవర్నర్ తీరును ఖండిస్తున్నాం

- Advertisement -

మంత్రి కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఎన్డీయే ప్రభుత్వం DNAలోనే తెలంగాణ రాష్ట్రంపై విషం నింపుకునీ ఉన్నది అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము.. తెలంగాణపై నరేంద్ర మోడీ ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. తెలంగాణ పుట్టుకను పదే పదే ఎందుకు అవమానిస్తున్నారు?.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత కాలం అన్నారు.. విషం చిమ్మారు.. మోడీ సర్కార్ విభజన హామీలను గాలికి వదిలేశారు.. ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.తెలంగాణలో దశాబ్ది వేడుకలు జరుపుకున్నాం.. కానీ వేడుకలు జరుగలేదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పాడు అని మంత్రి కేటీఆర్ మండిపడ్డాడు. మోడీ పాలమూరు జిల్లాను ఎంచుకున్నారు.. ఆ జిల్లాలో కాలు పెట్టే నైతిక హక్కు ఆయనకు లేదు అని మంత్రి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఏమి చేసింది?.. గోదావరి, కృష్ణ జలాల్లో వాట తేల్చాలని కోరారు.. ఇప్పటి వరకు అతి గతి లేదు.. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నో సార్లు అడిగాం.. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు.నీటి వాటాపై ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు గడ్డపై కాలు పెట్టేటప్పుడు స్పష్టత ఇవ్వాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కర్ణాటక, ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇచ్చింది.. భారతీయ జనతా పార్టీ కాదు మీది.. దగుల్బాజీ పార్టీ మీది.. బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అయిన.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఆ పార్టీది.. కృష్ణా జలాలపై మా వాట ఎందుకు తేల్చారు మోడీ? చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కృష్ణా జలాల వాటా కోసం న్యాయ పోరాటం చేశామని ఆయన పేర్కొన్నారు. 575 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి.. మోడీ ఇప్పుడైన పాప పరిహారం చేసుకుండి.. పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వండి.. వచ్చే ఎన్నికల్లో ఈ సారి కూడా 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు పోతాయని కేటీఆర్ తెలిపారు.మనసుతో ఆలోచించి ఉంటే గవర్నర్ తమిళిసై నిర్ణయం ఇలా ఉండేది కాదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. మరి ఈ ఇద్దరు అన్ ఫిట్ అన్నారు.. మరి మీరు అన్ ఫిట్ ఆ.. లేక మోడీ అన్ ఫిట్.. ఆ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే.. తప్పు ఏంటీ?.. గవర్నర్ తీరును ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే.. కొంత మంది వస్తారు.. కొంత మంది పోతారు.. అది పెద్ద విషయం కాదు.. గవర్నర్ విషయంలో మాకు ఉన్న అన్ని ఆప్షన్ లు చూస్తామని కేటీఆర్ చెప్పారు. 10 ఏళ్ల నుంచి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదని.. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల్లో ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాకే పాలమూరు రావాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ .. ఓట్లు కావాలంటే ప్రధానికి మంచి పనులు చేసే సత్తా ఉండాలన్నారు. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా.. ప్రజలు నమ్మరని అన్నారు. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశాం.. ఒకరు ప్రొఫెసర్‌, మంచి వ్యక్తి అని ఆమోదిస్తారని అనుకున్నాం.. మరొకరు ట్రేడ్‌ యూనియన్‌లో సేవలు చేస్తున్న సత్య నారాయణ..అయితే, మోదీ ఎజెండాగా తెలంగాణ గవర్నర్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ అయ్యే ఒక్కరోజు ముందు కూడా తమిళిసై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేశారు. ఆమెను నియమించడం సర్కారియా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమన్నారు. గవర్నర్ వ్యవస్థ దేశంలో అవసరమా..? గవర్నర్‌ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వ్యస్థను తీసేస్తారా.. ప్రధాని హోదాని వైస్రాయ్ చేస్తారా.. రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పగబట్టాయి. మాస్టర్‌ ఆఫ్‌ అటెన్షన్ డైవర్షన్ అంటూ ఎద్దేవ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్