- Advertisement -
వరద బాధితులకు ఫుడ్ డెలివరీని పర్యవేక్షించిన ఎంపి చిన్ని
MP Chinni supervised the delivery of food to the flood victimsవిజయవాడ
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫుడ్ డెలివరీ పాయింట్ వద్ద ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు. ఎంపీ కేశినేని శివ నాథ్, మంత్రి నారాయణ అధికారులతో పాటే ఉంటూ పనులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం లో వరద బాదితులందరికి ఫుడ్ డెలివరీ అయ్యేందుకు అధికారులు, నాయకులకు సలహాలు, సూచనలు అందించారు. వరద బాధితులకు ఆహార పంపిణీ సక్రమంగా అందరికీ అందెందుకు అధికారులు,నాయకులతో ఎక్కడిక్కడ ఒక వ్యవస్థ ను ఎం.పి. కేశినేని శివనాథ్ ఏర్పాటు చేసారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, 4 లక్షల 50 వేలకు పైగా టిఫిన్స్, లక్ష 50 వేల లీటర్ల కు పైగా పాలు పంపిణీ చేసారు.
- Advertisement -




