Tuesday, January 14, 2025

కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపి ఈటల

- Advertisement -

కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్శించిన ఎంపి ఈటల

MP Eetala visited Cantonment Hospital

సికింద్రాబాద్
బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు. ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో, వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల, సిబ్బంది మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతోపాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రానున్న రోజుల్లో వైద్యులు వైద్య సదుపాయాలు పరికరాల సంఖ్యను పెంచడంతోపాటు మెరుగైన వైద్య సదుపాయాలు చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. కంటోన్మెంట్ తో పాటు సమీప ప్రాంత ప్రజలకు మీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్