మాగంటి గోపీనాథ్, అజారుద్దీన్ లు చేసిన తప్పుడు అఫిడవిట్లు నమోదు పై న్యాయపోరాటం చేస్తాం.
ఎలక్షన్ కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చింది ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. ఆఫిడెఫిట్ లో మాగంటి గోపీ నాధ్ తప్పుగా నమోదు చేశారు. మొదటి పెళ్ళి, కొడుకు విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. బిల్ పేమెంట్స్ విషయంలో తప్పు చేశారు. మేము రిటర్నింగ్ అధికారి కి వివరించినా పట్టించుకోలేదు. ఆయన స్వంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తారు. చదువు విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆర్ ఓ పై కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. అదే సమయంలో మేము న్యాయ పోరాటం చేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు బాధ తో పాటు భయంతో ఉన్నారు.

అజారుద్దీన్ అఫిడవిట్ దాఖలులో తప్పు చేశారు. పేజి నెంబర్ 2లో ఫ్యామిలీ డీటెయిల్స్ సక్రమంగా భార్య పేరును ఇవ్వలేదు. కేసుల విషయాన్ని సైతం దాచి తనకు నచ్చినట్టు ఇచ్చారు. గోల్డ్ డీటెయిల్స్ లో కూడా తప్పు చేశారు. 2009 నుంచి 2014 మే వరకు ఎంపీగా చేసిన అజార్ ప్రభుత్వ క్వార్టర్స్, ఇతర బిల్లులు లేవని ఆఫిట్ లో పొందుపరచాలి. కానీ తనకు ఇది వర్తించదు చెప్పారు. స్కూటీని విషయంలో ఆర్ ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని ఎన్నికల పోటీ నుంచి వైదొలిగించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం విచారకరం. ప్రాపర్టీ విషయం లో కూడా బ్లాంక్ గా పెట్టారు. స్వార్థ రాజకీయాల కోసం పాకులాడే రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 9వ తేదీన ఉన్న అఫిడవిట్ 10న లేదు.



