Sunday, September 8, 2024

సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

- Advertisement -

మంత్రి రోజా భర్త ..  ఆ కామెంట్సే కారణం..

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నుంచి ఆయన్ను వెంటాడుతున్న ఈ కేసులో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  ముకుల్ చంద్ వల్ల తీవ్రంగా నష్ట పోయినట్టు 2016లో సెల్వమణి వ్యాఖ్యలు చేశారు. దాంతో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశారు ఫైనాన్షియర్ ముకుల్ చంద్. ముకుల్ చంద్ బోత్రా చనిపోయినా.. ఆ కేసును కొనసాగిస్తున్నారు ఆయన కుమారుడు గగన్ బోత్రా. సోమవారం విచారణ కోర్టులో విచారణ ఉండగా.. సెల్వమణి కోర్టుకు హాజరుకాలేదు. దాంతో సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై జార్జ్ టౌన్ కోర్ట్. తదుపరి విచారణ సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది.

Non-bailable warrant issued to Selvamani..
Non-bailable warrant issued to Selvamani..

మంత్రి నగరి రోజా భర్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి.. ఒక ఫైనాన్షియర్ వల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ మంత్రి రోజా భర్త సెల్వమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తెలుగుతోపాటు తమిళ సినిమాలకు పని చేశారు రోజా భర్త సెల్వమణి.. అయితే 2016లో ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఫైనాన్షియర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. ఒక ఫైనాన్షియల్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని ఆ ఫైనాన్స్ పేరు ప్రస్తావిస్తూ ఒక టీవీ ఛానల్ కు 2016లో ఇంటర్వ్యూ ఇచ్చాడు సెల్వమణి. ఆ ఇంటర్వ్యూను చూసిన సదరు ఫైనాన్షియర్ సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నైలోని జార్జ్ టౌన్ కోర్టులో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశాడు. ముకుల్ చంద్ బోత్ర అనే ఫైనాన్షియర్ పై సెల్వమణి వాక్యాలు చేశాడు.

2016 నుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే కొద్ది సంవత్సరాల క్రితమే ఫైనాన్షియల్ ముకుల్ చంద్ మరణించాడు.. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని సహించని ముకుల్ చంద్ కుమారుడు గగన్ బోత్రా కేస్ ను కొనసాగించారు. అయితే కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఇదివరకే సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ తర్వాత కూడా విచారణకు గైర్హాజరయ్యారు మంత్రి రోజా భర్త.. దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై నాన్వెలబుల్ వారెంట్ జారీ చేసింది… తదుపరి విచారణను సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు సెల్వమణి.. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్