హైదరాబాద్ లో  ఆగని ఐటి సోదాలు

- Advertisement -

అమీర్‌పేట్, కూకట్‌పల్లి శంషాబాద్‌లో మూడవరోజు  

హైదరాబాద్:అక్టోబర్ 07:  హైదరాబాద్ నగరంలో మూడవ రోజు ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేట్, కూకట్‌పల్లి శంషాబాద్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూజ కృష్ణ ఎండీ కృష్ణ ప్రసాద్ ఇల్లు ఆఫీసులతో పాటు శంషాబాద్ రఘువీర్ ఇల్లు, ఇందు ఫార్చ్యూన్ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగవేశారని.. పెట్టుబడులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారనే ఆరోపణల్లో భాగంగా ఆయా సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular