Sunday, September 8, 2024

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

- Advertisement -

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి..

విజయవాడ: తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు..

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. ఆయన వారసుడిగా చెప్పుకొనే జగన్ ఆన్న కేవలం 6 వేల పోస్టులతో దగా డీఎస్పీ చేశారని విమర్శించారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అలాంటి వైసీపీ నాయకులు, వాళ్లను వెనకేసుకొచ్చే వైసీపీ సోషల్ మీడియాకు ఆమె 9 ప్రశ్నలు సంధించారు..

1.2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?

2. ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?

4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?

5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధా..?

6. వైఎస్సార్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా ?

7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?

8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?

9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?

నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులకు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ షర్మిల సవాల్ విసిరారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్