- Advertisement -
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు
Officials who stopped the smuggling of sandశ్రీకాకుళం
శ్రీకాకుళం పట్టణం సమీపంలో ఇసుక అక్రమ రవాణాను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను ఇసుక మాఫియా నాగావళి నది నుండి తరలించి హైవే సమీపంలో డంప్ చేస్తోంది. సీఎం కార్యాలయంకు ఫిర్యాదు అందడంతో యంత్రాంగం కదిలింది. ఇసుక లోడుతో ఉన్న 14 ట్రాక్టర్ లను తమ్మినాయుడు పేట వద్ద పోలీస్, రెవిన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో ఇసుక తరలింపు చేసుకోవచ్చంటూ రెవిన్యూ, పోలీసులతో ఇసుక రవాణాదారులు వాగ్వాదానికి దిగారు.
- Advertisement -




