Sunday, September 8, 2024

అనుమానంతో ఇద్దరు బాలికలను చెట్టుకు కట్టేసి

- Advertisement -
On suspicion, two girls were tied to a tree
On suspicion, two girls were tied to a tree

దొంగతనం నేపంతో ఇద్దరు బాలికలకు చిత్రహింసలు

వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

వరంగల్ జిల్లా:ఆగస్టు 16:  ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు బాలికలను చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి  మండలం చెన్నూరు గ్రామంలో దొంగతనం నెపంతో ఇద్దరు 12 ఏళ్ల బాలికలను గ్రామంలోని బొడ్రాయి వద్ద చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా కళ్లల్లో కారం కొట్టి మామిడి కాయ పచ్చడ కళ్లల్లో రుద్ది నానా హింస పెట్టారు. ఇద్దరు ఇతర కులానికి చెందిన వారు బాలికల తల్లిదండ్రులను సైతం ఇబ్బందులకు గురి చేశారు.

చెన్నూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటిలో 15 రోజుల క్రితం రూ.1.35 లక్షలు నగదును ఎవరో ఎత్తుకెళ్లారు. అయితే వారింటికి ఆయన సోదరుడి కూతురుతో పాటు మరో ఇద్దరు అమ్మాయి తరుచుగా వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆ డబ్బులను వీరే తీశారని అనుమానంతో ఇంటి యజమాని దారుణంగా కొట్టాడు. ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించడంతో వారు మౌనంగా ఉండిపోయారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా మంగళవారం బయటపడింది. కాగా, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందిందని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్