- Advertisement -
ఖమ్మం: పాలేరు నియోజక వర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతోంది. అందరూ ఊహించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ షర్మిల పాలేరు పోటీ నంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి విజయావకాశాలు మెరుగయ్యాయని అందరూ అనుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అయితే షర్మిల తప్పుకున్నా.. ఇపుడు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి సై అనడంతో రాజకీయం మరో మలుపు తిరిగింది. నియోజకవర్గం గెలుపు ఓటములను ప్రభావితం చేసే లెఫ్ట్ ఓటు బ్యాంకు వుండంతో త్రిముఖ పోటీలో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నదీ హాట్ టాపిక్గా మారింది.
- Advertisement -



