*పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి*
*మున్నూరు కాపు సంఘం చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ మడ్లపల్లి శ్రీనివాస్*
*గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో పటేల్ యూత్ ఫోర్స్ స్టిక్కర్స్ ఆవిష్కరణ*
పటేల్ యూత్ ఫోర్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన కరీంనగర్ వి-కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న పటేల్ యూత్ ఫోర్స్ గర్జన సభను నిర్వహిస్తున్నాము.
కరీంనగర్లోని బొమ్మ వెంకన్న పటేల్ విగ్రహం నుండి వేలాదిగా యూత్ పటేల్స్ తో బైక్ ర్యాలీ ఉంటుంది.
అనంతరం కరీంనగర్ బైపాస్ రోడ్ లోని వి కన్వెన్షన్ లో యూత్ ఫోర్స్ గర్జన సభ ఉంటుంది.
గంగాధర మండలంలోని మున్నార్ కాపు సంఘం పటేల్స్ అధిక సంఖ్యలో హాజరై గర్జన సభను విజయవంతం చేయగలరు.
ఇక్కడ మున్నూరు కాపు సంఘం సభ్యులు వేముల భాస్కర్, వేముల అంజి, మడ్లపెళ్లి గంగాధర్,వాసాల గంగాధర్, మడ్లపెళ్లి జలపతి, దాతు అంజి, తూము నారాయణ, పెరుక శంకర్, వేముల రవీందర్, దొడ్ల ఎల్లారెడ్డి, గంట కిషన్, సామంతుల శ్రీనివాస్, జంగిలి మహేందర్, రుద్రాక్ష రాజేశం, తూము తిరుపతి, జారతి రాజయ్య, పెంచాల చందు, కముటం శ్రీనివాస్, ఆకుల మనోహర్, వోడ్నాల వంశీకృష్ణ, తూము కరుణాకర్, తూము రాజు, జుట్టు శివ, తూము రవి తదితరులు పాల్గొన్నారు



