Tuesday, April 22, 2025

 మోడీ మోసపూరిత మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు

- Advertisement -

 మోడీ మోసపూరిత మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు

– రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు

– కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని రాహుల్ ని ప్రధాని ప్రధానం చేసేందుకు పునాదులు వేద్దాం

– కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల

మోడీ పదేళ్ళ పాలన తర్వాత మళ్లీ గెలవాలని కుయుక్తులు  పన్నుతున్నాడని, దేశంలో నిరుద్యోగం పెరిగి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావ్ విమర్శించారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో వెలిచాల రాజేందర్ రావు ప్రసంగించారు.  బిజెపి ప్రభుత్వం కుల మత విద్వేషాలను సృష్టిస్తూ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ పదేళ్లు పూర్తయినప్పటికి కనీసం 20 వేల నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఘనత.. దళితులను చిన్నచూపు చూసిన ఘనత బిజెపి – బీఆరెస్ పార్టీలకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము దోచుకొని అదాని అంబానీలకు దారా దత్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ-నరేంద్ర మోడీల మధ్య జరుగుతున్న యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన నెలలోపు మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రూ.2500/- జమ చేయడంతో పాటు, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు న్యాయాల గురించి ప్రజలకు తెలియజేసి, బిజెపి-బీఆర్ఎస్ పార్టీలో గత పదేళ్ల ప్రజావ్యతిరేక పాలనను గురించి ఓటర్లకు వివరించాలని తద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు,  సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆరేపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్, ప్రణవ్, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పార్టీ ఎంపీపీలు, జడ్పిటిసిలు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్