- Advertisement -
హైదరాబాద్ నవంబర 7, (వాయిస్ టుడే ): ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. అయితే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. నవంబర్ 7 వ తేదీ లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు.
- Advertisement -



