ఏసీబీ వలలో 10వేలు లంచం తీసుకుంటున్న ప్రిన్సిపల్

- Advertisement -

ఏసీబీ వలలో 10వేలు లంచం తీసుకుంటున్న ప్రిన్సిపల్

Principal taking bribe of 10 thousand in ACB trap

ఖమ్మం
మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు రాలు పెండింగ్ లో ఉన్న తన జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపాల్, లంచం అడుగు తున్నాడని, ఏసీబీకి ఫిర్యా దు చేయడంతో ఏసీబీ అధికారులు రైడ్ చేసి ప్రిన్సి పాల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధన నిర్వహిస్తున్న తెలుగు  ఉపాధ్యాయురాలు సంధ్యా రాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ  10 వేలు డిమాండ్ చేశారు. వాటి కోసం పది రోజులుగా ఆమెను ఇబ్బంది పెడుతుం డటంతో సంధ్య ఏసీబీ అధి కారులను ఆశ్రయించింది.
వారి సూచన మేరకు 2 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా ఆయన తన అటెండర్, రామకృష్ణకు ఇవ్వమని చెప్పాడు.
టీచర్ సంధ్య అటెండర్ కు డబ్బులు ఇస్తుండగా  ఏసీబీ డీఎస్పీ వై..రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular