Sunday, September 8, 2024

పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత

- Advertisement -

పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత
వనమహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి
జగిత్యాల,

Protecting the environment is everyone’s responsibility

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న వనమహోత్స కార్యక్రమాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఈద్గా దగ్గర ఐపిఎస్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో  పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ
పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని చైర్ పర్సన్  అన్నారు.
వన మహోత్సవానికి సరిపడా మొక్కలు అందుబాటు లో ఉంచుకోవాలని, ప్రజలకు అవసరమైన మొక్కలు అందించి ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాలో నాటేలా చూడాలన్నారు. నాటిని వాటి సంరక్షణ గురించి తెలియజేయాలని ఆదేశించారు. పెరిగిన మొక్కలు నరికి వేయడం వల ను ప్రకృతికి నష్టం జరుగుతుందని, పట్టణంలో చెట్లను నరికి వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
మొక్కలు నాటడడంతో ప్రకృతిని కాపాడినవారువుతారని పేర్కొన్నారు.ఆనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ పచ్చదనం పెంపుతూనే మానవ మనుగడ సభ్యంగా సాగుతుందని వాస్తవాన్ని గ్రహించాలన్నారు. మానవ మనుగడకు చెట్టను కాపాడుకోవడంతోపాటు విరివిరిగా మొక్కలు నాటడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం మన్నారు. రోజులలో చెట్లు పెంపకం అనేది చాలా ముఖ్యమని, వాతావరణం లో ఆక్సిజన్ తగ్గిపోయి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, ప్రస్తుత సమాజంలో విస్తరించిన గ్లోబలైజేషన్ మూలంగా పెద్ద ప్రమాదం ముంచుకోచ్చిందని, టెలికమ్యూనికేషన్ చాలా పెరిగిపోయి, రేడియేషన్ ఎంతో వాతావరణంలో ఇమిడిపోయిదని అన్నారు. ఈ రేడియేషన్ వాతావరణం లో మన కంటికి కనబడకుండా ఉండి ఆక్సిజన్ తగ్గించి మన అనారోగ్యాలకు కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. దీనికి నివారించాలంటే మొక్కలు నాటడమే సరైన ప్రత్యామ్నయ మార్గం ఆన్నారు… ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్సీ కోరారు..ఈ కార్యక్రమంలో
ముస్లిం మైనార్టీ నాయకులు మీర్ ఖాజీమ్ అలీ, కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్స్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ దుర్గయ్య ,స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్