Monday, May 18, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Quality food should be provided to the students

వనపర్తి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు అన్ని వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్, ఉజ్జన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాష,వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి లు పేర్కొన్నారు
గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్టి బాలికల గురుకుల విద్యాలయంలో వారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో 40% డైట్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచిందని, వీటితోపాటు  నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్బులను నిర్మిస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 43 పనుల మంజురీలను కోరుతూ, ఉద్యాన శాఖ తరఫున మంజూరు చేసే తుంపర సేద్యం కు సంబంధించి 3600 యూనిట్లను మంజూరు చేయాలని కోరుతూ  స్థానిక శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి  నేరుగా నివేదికలను సమర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆఫ్జలుద్దీన్, బీసీ సంక్షేమ శాఖ అధికారి సుబ్బారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్