Rammohan Naidu inspected the construction works of International Airport..:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు..
కేంద్రమంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి భోగాపురానికి రామ్మోహన్..
ఏది ఏమైనా 2026కి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటన..
ఈ ఎయిర్పోర్ట్ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడి..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను పరిశీలించిన ఆయన.. జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారిపై కూడా ఆరా తీశారు.. విమానాశ్రయ నిర్మాణ పనులను జి.ఎం.ఆర్. సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎంపీ అప్పల నాయుడు, శాసన సభ్యులు లోకం నాగ మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. జూన్ 9న పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి భోగాపురం ఎయిర్ పోర్టును సందర్శించడం జరిగింది.. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే ఈ ఎయిర్ పోర్టు పూర్తి చేసుకోవాలి.. ఇక్కడ ఉన్న పిల్లల



