రూ. 15 లక్షలు మద్యం పట్టివేత
Rs. 15 lakhs for arresting liquor
డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం.
పట్టుబడ్డ కానిస్టేబుల్ హోంగార్డ్.
మూడు కార్ల స్వాధీనం..
అయిదుగురుపై కేసు నమోదు
శంషాబాద్ ఎయిర్పోర్టులో పనిచేస్తున్న కానిస్టేబుల్ హోంగార్డులు కలిసి డ్యూటీ పై లిక్కర్ను ఎక్సైజ్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి.. నూతన సంవత్సరం వేడుకల కోసం భారీగా కొనుగోలు చేసిన రూ. 15 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ లో భాగంగా విధులు నిర్వహించినటువంటి ఈ కానిస్టేబుల్, హోంగార్డు మరి కొంతమంది కలిసి ఎయిర్పోర్టులో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ దుకాణాల నుంచి మద్యాన్ని పలువురు ప్యాసింజర్ల పేరుతో కొనుగోలు డ్యూటీ ఫ్రీ మద్యం బాటిలను అమ్మకాలు చేపడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు డ్యూటీ ఫ్రీ మద్యం అమ్మకాలు జరుపుతుండగా మూడు కార్లను, వాటిలో లభించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మద్యం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని శంషాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణప్రియ తెలిపారు.