Sunday, September 8, 2024

రూ. 31.25 లక్షలతో అలంకరణ

- Advertisement -
Rs. 31.25 lakhs for decoration
Rs. 31.25 lakhs for decoration

కడియపులంక ముసలమ్మ కు  రూ.31.25 లక్షల నోట్లతో అలంకరణ

ఏలూరు: మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ పుంతలో ముసలమ్మ వారి ఆలయాన్ని రూ. 31 .25 లక్షల  నోట్లతో అలంకరించారు. ప్రస్తుతం చాలామణిలో ఉన్న అన్ని రకాల కొత్త నోట్లను అంటే రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు వినియోగించి ఈ అలంకరణ అద్భుతంగా చేశారు.అలాగే బ్యాంకుల ద్వారా కొత్త నాణేలు కూడా తీసుకుని అలంకరించారు.మూడు రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేసారు. సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకలను ఈ ఆలయ కమిటీ వారు విన్నూత్న రీతిలో జరుపుతూ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకతను చాటుకుంటూ వార్తలకు ఎక్కుతారు. ఆ విధంగానే ఈ అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరణకు లక్షలాది రూపాయల నోట్లను వినియోగించడం అందర్నీ ఆకట్టుకుంటుంది.భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి నిత్య అలంకరణ చేసే రమేష్ కుమార్ శర్మ, ధవళేశ్వరం శివాలయం అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్