- Advertisement -
457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న కంటెయినర్ను బాపట్ల జిల్లా సెబ్ అధికారులు పట్టుకున్నారు.
బాపట్ల శివారున 216ఎ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో పైలెట్ వాహనంతో వెళ్తున్న కంటెయినర్ లారీని బాపట్ల, చీరాల సెబ్ పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
వాహనం లోపల 17 బస్తాలలో ఉన్న మొత్తం 457 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.
- Advertisement -



