Sunday, September 8, 2024

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

- Advertisement -

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

హైదరాబాద్:ప్రతినిధి

హైదరాబాద్: ఫిబ్రవరి 01
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం ప్రారంభమైంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న ఉచిత ప్రయాణం పథకం కింద తెలంగాణలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈపథకానికి రాష్ట్రవ్యా ప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజూ ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. దాంతో చాలా మంది మగవారు.. తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు పలువురు.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ, మగవారికి సీట్లు లేకపోవడం వంటి ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ గోడు పట్టించుకోవాలని ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుం దని,వార్తలు వస్తున్నాయి. బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తుంది.

పురుషులుకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం వల్ల విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతు న్నారు. ఈ క్రమంలో వారి కోసం కొన్ని మార్గాల్లో మరీన్ని సర్వీసులు నడిపే విషయంపై ఉన్నతాధి కారులు చర్చిస్తున్నారట.

అలాగే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధి కారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్