Sunday, September 8, 2024

షా… మార్క్ వార్నింగ్

- Advertisement -

షా… మార్క్ వార్నింగ్
హైదరాబాద్, డిసెంబర్ 29,
తెలంగాణలో లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపై భేటీలో చర్చించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా సమావేశం వాడీవేడీగా సాగినట్లు తెలుస్తోంది. వర్గ విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా  వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి అంతా సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చెయ్యొద్దని చెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసింది. 30 సీట్లు వస్తాయని ఆశించినా ఫలితం కనబడలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఇది రిపీట్ కాకూడదు. లోక్ సభ ఎన్నికల్లో అంతా సమన్వయంతో పని చేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం కల్పిస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం.’ అని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఓకే చెప్పిన నేపథ్యంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ బరిలో బండి సంజయ్, నిజామాబాద్ లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. అంతకు ముందు ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్వాగతం పలికారు.బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపైనా అమిత్ షా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యేనే ఉంటే బాగుంటుదనే ఆయన అభిప్రాయపడ్డట్లు సమాచారం. అయితే, ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి రేసులో ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్