మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితకు షాక్

- Advertisement -

మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితకు షాక్
రంగారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ది, మంత్రి సబిత కు షాక్ తగిలింది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామచందర్ బీఆర్ఎస్  పార్టీని వీడి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గజ్జల రామచందర్ మాట్లాడుతూ ఒక దళిత కార్పొరేటర్ నైన నాకు అధికార పార్టీలో  ఆత్మగౌరవం కొరవడిందని ఆరోపించారు.  నాపై రాజకీయ అణిచివేత జరుగుతుందని గౌరవానికి ప్రతికైన కాంగ్రెస్ పార్టీలో చేరాలని, ఆసక్తిగా వచ్చి పార్టీలో చేరాను. మహేశ్వరం నియోజకవర్గంలో కంచుకోట అయిన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గెలుపులో నా వంతు కృషి ఉండాలని, ఆరు గ్యారెంటీ పథకాలు అణగారిన  వర్గాలకు చేరుతాయని, కాంగ్రెస్ పార్టీలోనే పేదలకు న్యాయం జరుగుతుందని  తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular