Wednesday, January 14, 2026

కరీంనగర్ లో వింత దొంగ

- Advertisement -

కరీంనగర్ లో వింత దొంగ
రెండు బీరు బాటిళ్లు చోరీ
కరీంనగర్, మార్చి 28, (వాయిస్ టుడే)

Strange thief in Karimnagar

దొంగలు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. చోరీలు చాలా జాగ్రత్తగా, తెలివిగా చేస్తున్నారు. దొంతతనాలు చేసేందుకు పక్కాగా ప్లాన్లు వేసుకోవటం చూస్తుంటే ఓరి మీద తెలివి పాడుగానూ అనిపిస్తుంటుంది. చేసేది

తప్పుడు పని కాబట్టి బయటికి అనరు కానీ.. కొన్ని చోరీలు చేసే విధానం, అమలు చేసే ప్లాన్లు, దొరకకుండా ఉండేందుకు తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే.. చాలా మందికి ‘అబ్బ ఏం తెలివిరా నాయనా’ అనిపిస్తుంటుంది.

మరీ అలా అనిపించేది కాకపోయినా.. ఈ దొంగలు కూడా సావు తెలివితేటలే వాడారు ఈ చోరీలో కూడా. మరి వాళ్ల తెలివి తేటలు ఏంటో తెలియాలంటే కరీంనగర్ జిల్లాలో జరిగి వైన్ షాప్ దొంగతనం గురించి

తెలుసుకోవాల్సిందే.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్ వద్ద దుర్గా వైన్స్‌లో దొంగతనం జరిగింది. ఎప్పటిలాగే ఉదయం సమయంలో దుకాణం తెరవగానే.. పైకప్పుగా వేసిన రేకులకు కత్తిరించి

ఉండటం చూసి.. యజమాని షాక్ అయ్యాడు. చుట్టూ చూశాడు. దొంగతనం జరిగిందని గమనించాడు. దీంతో.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. అసలు విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు..

వైన్స్‌కు చేరుకున్నారు. చోరీ జరిగిన విధానాన్ని.. ఎంత సరుకు పోయిందన్న విషయాలు పరిశీలించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా..

దొంగలు ఎలా చోరీ చేశారు.. ఏమేం ఎత్తుకుపోయారు.. అసలు వాళ్లు ఎవరూ.. అన్న విషయాలు తెలుసుకునేందుకు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే.. వైన్స్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

పరిశీలించే ప్రయత్నం చేశారు. కానీ.. దొరకకుండా ఉండేందుకు ఆ దొంగలు చేసిన పనికి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఎలాగూ.. ఈ మధ్య ఏ నేరం జరిగినా.. నిఘా నేత్రాలు నిమిషాల్లోనే నిందితులను

పట్టిస్తున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన దొంగలు.. మొదట ఆ నిఘా నేత్రాల మీదే ఫోకస్ చేశారు.వైన్స్ షాపులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తే.. వాళ్ల చోరీ దృశ్యాలు మాత్రమే

రికార్డవవు.. కానీ ధ్వంసానికి ముందు వరకు రికార్డ్ చేస్తాయి కదా. ఈ లాజిక్‌ను కూడా పసిగట్టిన చోరులు.. కావాల్సిన మందుబాటిళ్లు, కౌంటర్‌లోని డబ్బుతో పాటు సీసీ కెమెరా ఫుటేజీ బాక్సులను కూడా ఎత్తుకెళ్లారు.

అంతేకాదు.. పోతూ పోతూ ఇన్వర్టర్‌ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే.. ఇంతా చేసిన దొంగలు ఎత్తుకెళ్లింది మాత్రం కేవలం రెండు బీర్ బాటిళ్లే కావడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.ఇంతకూ ఎంత సరుకు

ఎత్తుకెళ్లారని పోలీసులు ఆరా తీస్తే.. లోపల ఉన్న స్టాక్ మొత్తాన్ని పరిశీలించిన యజమాని షాక్ అయ్యాడు. గత రాత్రి షాప్ మూసేసేముందు రాసుకున్న లెక్కల ప్రకారం.. రెండే రెండు బీర్ బాటిళ్లు తక్కువ వస్తున్నట్టు

గమనించి.. ఒకటికి రెండు సార్లు పరిశీలించి.. అదే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అయితే.. ఆ దొంగలు ఫోకస్ చేసింది మందుబాటిళ్లపై కాకుండా నగదు మీద కావటంతో.. కౌంటర్‌లో పెద్దగా డబ్బు లేకపోవటంతో..

ఫ్రస్ట్రేషన్‌లో ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్