- Advertisement -
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
Strict action for riotingమచిలీపట్నం
శక్తి పటాల ప్రదర్శనలో ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ హెచ్చరించారు.ఈ నెల 2 వ తేదీన బలరాముని పేటలో చోటు చేసుకున్న ఇరువర్గాల ఘర్షణ కేసులో 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపామన్నారు.వీరిలో అత్యధిక మంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులు రాగద్వేషాలకు పోయి ఇటువంటి కేసుల్లో చిక్కుకోవడం బాధాకరమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారు ఎవరైనా చూస్తూ ఊరుకోమని అయన హెచ్చరించారు…
- Advertisement -




