అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం

- Advertisement -
Subrahmanya Swamy Kalyanam is the most magnificent

కోరుట్ల డిసెంబర్ 18
అయ్యప్ప గుట్టపై కొలువైయున్న అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు పాలెపురామో

శర్మ వైదిక నిర్వహణలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. ముందుగా పుణ్యాహవాచనం చేసి కళ్యాణ క్రుతువును అర్చకులు జరిపించారు.. ఈ కార్యక్రమంలో దేవాలయ శాశ్వత గౌరవ అధ్యక్షులు చిద్రాల

నారాయణ గురు స్వామి, ఆడహక్ కమిటీ సభ్యులు గండ్ర రాజేందర్రావు, అజేంద్రరావు, గడ్డం మధు, అంబటి శ్రీనివాస్, బట్టు హరికృష్ణ, కన్యాదాతలుగా వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular