Sunday, September 8, 2024

సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు

- Advertisement -

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో  అక్టోబరు 5 నుంచి

హైదరాబాద్, సెప్టెంబర్ 4, (వాయిస్ టుడే):  తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం (ఆగస్టు 2) ఉత్తర్వులు జారీ చేశారు.

➥ సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్ఏ-1) పరీక్షలకు సంబంధించి ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

➥ అదేవిధంగా 6, 7వ తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, ఎనిమిదో తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ ఇక 9, 10 తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా విధ్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

Summative Assessment-1 Exams
Summative Assessment-1 Exams

ఏడు పేపర్లతోనే పరీక్షలు..

ఈ ఏడాది 8, 9, 10 తరగతి విద్యార్థులకు మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలను రెండు పేపర్లుగా విభజించి ఒకేరోజు ఆ రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ రాధా రెడ్డి తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్