- Advertisement -
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛత హి దివాస్
Swachhta Hi Diwas is to keep the village clean
కౌతాళం
గ్రామాలన్ని అభివృద్ధికి పూలబాట కావాలని గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని నినాదంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత హి దివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కూటమి నాయకులు మరియు ఎంపీడీవో సుబ్బరాజు,గ్రామ సర్పంచ్ పాల్ దిన కార్ పేర్కొన్నారు. శనివారం గ్రామపంచాయతీ లో ఏర్పాటుచేసిన స్వచ్ఛత ఈ దివాస్ కార్యక్రమమును కూటమి నాయకులు ప్రారంభించారు. గ్రామపంచాయతీ నుండి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ మరియు బిస్మిల్లా సర్కిల్లో మరియు డ్రైనేజీల్లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ స్వచ్ఛత హి దివస్ కార్యక్రమలు మూడవ శనివారంలో చేపట్టిననని ప్రతి ఒక్కరూ గ్రామాన్ని శుభ్రపరిచే విధంగా సహకరించాలని కోరారు.మంత్రాలయం నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉలిగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చన్న బసప్ప, వెంకట పతి రాజు, అడివప్ప గౌడ్,సతీష్ నాయుడు జనసేన రామాంజి నేయులు, కాశి, రహిమాన్, దొడ్డన్న గౌడ్,సిద్దు,కొట్రష్ గౌడ్, వీరేష్, రామచంద్ర,టిప్పు సుల్తాన్.కురు గోడ్,కత్రికిచంద్ర,రామలింగ,సో మన్న, లింగేష్,మరియు సచివాలయం సిబ్బంది గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



