తమిళనాడు సీఎం స్టాలిన్‌ చిన్నారులతో కలిసి అల్పాహారం

- Advertisement -

దేశంలోనే తొలిసారి అల్పాహార పథకం.. పిల్లలకు స్వయంగా వడ్డించిన సీఎం స్టాలిన్‌

నాగపట్టణం: తమిళనాడు (Tamil Nadu)లోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (breakfast scheme)’.. సీఎం స్టాలిన్‌ (MK Stalin) శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తమిళనాడే కావడం విశేషం.

నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీం (breakfast scheme) రెండో విడతను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు..

Tamil Nadu CM Stalin having breakfast with children
Tamil Nadu CM Stalin having breakfast with children
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular