గోకులం షెడ్డు ను ప్రారంభించిన టిడిపి నాయకుడు డి. శంకర్ రెడ్డి…
TDP leader who started Gokulam Sheddu D.Shankar Reddy...కొలిమిగుండ్ల, జనవరి 11,
కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ టిడిపి నాయకుడు డి. శంకర రెడ్డి, గ్రామ ప్రజలు రైతులతో కలిసి నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును శనివారం ప్రారంభించారు. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గోకులం షెడ్లను నిర్మిస్తున్నారని ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు గోకులం షెడ్డు నిర్మించుకోవడానికి అర్హుడని ఈ అవకాశాన్ని గ్రామాలలో ఉన్న రైతులు వినియోగించుకోవాలని టిడిపి నాయకుడు డి .శంకర్ రెడ్డి శనివారం అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రమణమ్మ, ఈసీ రాజబాబు, టిడిపి నాయకుడు డి. శంకర్ రెడ్డి, కట్టుబడి రామ్మోహన్, వర్ధన్, టిడిపి నాయకులు వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు కృష్ణయ్య, యువసేన వెంకటేష్ ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




