Sunday, September 8, 2024

పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు అధికారులలో టెన్షన్

- Advertisement -

కొడంగల్ నవంబర్ 30:  రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంలమొరాయింపు అధికారులను టెన్షన్ పెడుతోంది. తాజాగా కొడంగల్ యోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట మండలంలోని తుంకిమెట్ల 194 పోలింగ్ స్టేషన్లో అరగంటకుపైగా ఈవీఎం మొరాయిస్తోంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. క్యూలైన్లో నిల్చోవడంపై పలువురు అసహనంగా ఉన్నారు. త్వరగా సమస్య పరిష్కరించి పోలింగ్ మళ్లీ ప్రారంభించాలని కోరుతున్నారు.

ఆసిఫాబాద్‌లో సైతం..

అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ నంబర్ 189 లో రెండు గంటలుగా ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. అలాగే కాగజ్ నగర్ పోలింగ్ బూత్ నంబర్ 63లో కూడా సాంకేతిక సమస్యతో రెండు గంటలుగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో ఓటర్లు వెనుదిరుగుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్