కాంగ్రెస్ పార్టీ  ప్రజలకిచ్చిన హామిలు నేరవెర్చకుండా సంవత్సరకాలంగా  మెాసం చేస్తుంది

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ  ప్రజలకిచ్చిన హామిలు నేరవెర్చకుండా సంవత్సరకాలంగా  మెాసం చేస్తుంది

The Congress party has been falsifying its promises to the people for years

 5 ఎళ్ల మా పాలనలో రామగుండానికి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఎర్పాటు చేయుంచాము.

= తొలి సిఎం కేసీఆర్‌ ని నిందించడం  తప్ప కాంగ్రెస్  చేసింది ఏమి లేదు.

= తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచి మార్చేందుకు తొలి సిఎం కేసీఆర్‌  శ్రమించారు.

= రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
రామగుండం
:
కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది…  2023 ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెర్చవెర్చకుండా సంవత్సర కాలంగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం  మెాసం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్  అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలైనా మహీళలకు 2500, వృద్దులకు 4 వేల ఫించన్ రైతు భరోసా రైతు బంధు విద్యార్థులు స్కూటీలు తదితర హామిలు 2025వ సంవత్సరంలోనైనా  నేరవెర్చాలని డిమాండ్ చేశారు.  లేదంటే బి.ఆర్.ఎస్ పార్టీ పక్షానా పోరాడుతామని హెచ్చరించారు.రామగుండం ప్రజలందరి ఆశీర్వాదం తో 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాల పాటు కారోనా మహమ్మరి ప్రజల జీవితాలను అతలకుతలం చేసిందని గుర్తుచేశారు.  సందర్భంలో ప్రజలందరికీ అండగా నిలిచామన్నారు. అనాడు పెదప్రజలు  ఆసుపత్రికి వెళ్లామన్నా సౌకర్యాలు లేవు…  కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కార్పోరేట్ స్దాయు వైద్యం అందాలన్నా సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని మెప్పించి ఓప్పించి ఈ ప్రాంతానికి సింగరేణి సంస్థ ద్వారా 510 కోట్లతో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్  మెడికల్ వైద్యకళాశాలను, నర్సింగ్ కళాశాలను తన 5 ఎళ్ల కాలంలో విజయవంతంగా ఎర్పాటు చేయుంచామని చెప్పారు. మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రాష్టాన్ని దేశానికే దిక్సూచి చేయాలని కేసీఆర్‌  10 ఎళ్ల శ్రమించారన్నారు.
దేశంలో ఎక్కువ లేని రైతు సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేసింది బి.ఆర్.ఎస్ పార్టీ తొలి సిఎం కేసీఆర్‌ అన్నారు. అభివృద్ధి  సంక్షేమ చెస్తాం మార్పు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్ిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంగా ఇచ్చిన హామిలను నెరవెర్చాకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఎళ్ల పాటు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువేళ్లినా తొలి సిఎం కేసీఆర్‌ ని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం వారిపై నిలపినిందాలు వేస్తు మాటాలు మాట్లాడుతూ కాలం గడిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశం లో కార్పోరేటర్లు బాదె అంజలి కల్వచర్ల కృష్ణ వేణీ జనగామ కవిత సరోజినీ కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ నాయకులు  అచ్చే వేణు చెలకలపల్లి శ్రీనివాస్ నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ పిల్లి రమెష్ మెతుకు దేవరాజ్ ఇరుగురాళ్ల శ్రావన్ నిట్టూరి రాజు ముద్దసాని సంధ్యా రెడ్డి  ఆవునూరి వెంకటేష్ బొబ్బిలి సతీశ్ వెంకన్న కొడి రామకృష్ణ అల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular