ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు
నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై కినక వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అయన అన్నారు.
నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు

- Advertisement -
- Advertisement -