Sunday, September 8, 2024

అవినీతి బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది: ఆదం సంతోష్ కుమార్

- Advertisement -

సికింద్రాబాద్, అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): అవినీతి పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీని సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంతోష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. శాంతినగర్ లో పలు కాలనీలు, బస్తీలలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, బిఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజలకు వివరించారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదం ఉమాదేవి, ఆదం సుజన్ కుమార్, అమర్నాథ్ గౌడ్, బ్రహ్మాజీ, షకీల్ ఖాన్, నర్సింగ్ రావు, దాము, చక్రం, జయరాజ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్