Tuesday, March 17, 2026

ఓటరు నమోదుకు రేపే తుది గడువు

- Advertisement -

హైదరాబాద్‌:అక్టోబర్‌ 30: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఓటు పొందని వారు కొత్తగా ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరితోపాటు ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో పేరులేని వారంతా కొత్తగా మళ్లీ ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

జాబితాలో పేరు ఉన్నా వారి నివాసం వేరే చోటికి మార్చినా.. పేరు వంటి ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యి ఉన్నా వారంతా నవంబర్‌ 30 జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హులుగా ఎంచబడతారు.

Tomorrow is the deadline for voter registration
Tomorrow is the deadline for voter registration

ఇలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 31 తేదీలోపు అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ, పేరు, ఫొటో వివరాలను దిద్దుకోవడానికి ఫారం 8 దరఖాస్తులను అక్టోబర్ 31తేదీలోగా సమర్పిస్తే వారందరికీ ఓటు హక్కు లభిస్తుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. అందులో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.

Tomorrow is the deadline for voter registration
Tomorrow is the deadline for voter registration

కాగా నవంబర్‌ 3 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్వెలువడనుంది. అదే నెల 10 తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇక మినేషన్ల దాఖలుకు సరిగ్గా 10 రోజుల ముందు అంటే అక్టోబర్‌ 31 తేదీ నాటికి ఓటర్ల నమోదు దరఖాస్తులు నిలిపివేస్తారు.

తుది తేదీ ముగిసేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్