Sunday, September 8, 2024

రక్షణ శాఖ భూములను తెలంగాణ బదలాయించండి

- Advertisement -

రక్షణ శాఖ భూములను తెలంగాణ బదలాయించండి
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ
హైదరాబాద్లో రహదారుల విస్తరణ ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని  కేంద్ర  రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు.  రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఆర్సీఐ, ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని. ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసిన కారణంగా వాటిని పునరుద్ధరించాలని లేదా కొత్తగా మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్