జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు.

తమన్నా సింహాద్రి గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గానూ పాల్గొన్న చేసిన విషయం తెలిసిందే.

భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ త‌మ‌న్నా సింహాద్రి పోటీ చేశారు. టీడీపీ మంగళగిరి అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత నారా లోకేశ్‌పై సింహాద్రి పోటీకి దిగారు.

కాగా, అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు.

క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ అప్పట్లో ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో తమన్నా సింహాద్రి జనసేనలోనూ పనిచేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular