యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులకి దుర్గాదేవి స్టేజ్ ప్రారంభం

- Advertisement -

యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులకి దుర్గాదేవి స్టేజ్ ప్రారంభం

Under the Young Men's Association, the Durga Devi stage was launched for Navratri

పరవాడ,
మండల కేంద్రమేనా పరవాడలో  సంతబైల వద్ద యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగబోయె శ్రీదుర్గాదేవి శరన్నవరాత్రులకు స్టేజ్ నిర్మాణానికి అసోసియేషన్ వ్యవస్థాపకులు,పరవాడ మాజీ సర్పంచ్ చుక్క రామునాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఎంపిపి పైల వెంకట పద్మ లక్ష్మి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ  సందర్బంగా చుక్కా  రాము నాయుడు మాట్లాడుతూ విజయదశమి నవరాత్రుల మహోత్సవాలకు శ్రీదుర్గాదేవి అమ్మవారిని అక్టోబర్ 3వ తేదీన ప్రతిష్టించడం జరుగుతుందని, నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించబడతాయని, అక్టోబర్ 12 విజయదశమి రోజున అమ్మవారిని నిమ్మజ్జనం చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో కర్రి ఎర్నాయుడు దంపతులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ ఉప సర్పంచ్,వార్డు మెంబెర్ పోతల అప్పలనాయుడు,చుక్కా వెంకటలక్ష్మి,వెన్నల సన్యాసి రావు, పైల జూనియర్ అప్పలనాయుడు, పైల అప్పారావు (టివి), వ్యాపారవేత్త కూండ్రపు సోమునాయుడు, కాంటాక్ట్ర్ బానోత్ బలరామ్,బండారు ఆనంద్ (ఆనంద్ స్పోర్ట్స్ షాప్),గండి చంద్రరావు, ద్వారపూడి శ్రీనివాసరావు, పరవాడ జగదీశ్వరరావు, గండి శ్రీనివాసరావు, గండి లోకేశ్వరరావు, కర్రీ సూరిబాబు, గండి వెంకటరావు,చుక్క నమో, చుక్క గోపి, చుక్క అప్పలనాయుడు, గండి నాని, గండి సన్యాసిరావు, రెడ్డి నారాయణరావు, పైల పైడిం నాయుడు, కూండ్రపు సోమునాయుడు, వడిశల సూరిబాబు, తేలు రమణాజీ, రాజాన రమణ (మెకానిక్),  బొడ్డు శ్రీధర్, గండి అప్పారావు, మరియు దుర్గ భవానీలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular