Tuesday, January 27, 2026

వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

- Advertisement -

వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

Vaikapa MLAs should resign

షర్మిల
విజయవాడ
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైకాపా  అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తీరని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి విమర్శించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, వైకాపా కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం.  మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.  మీకు మాకు పెద్ద తేడా లేదు. జగన్ మోహన్ రెడ్డి కి 38 శాతం వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదు.  38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ YCP నీ నిజానికి ఒక “ఇన్ సిగ్నిఫికెంట్”పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని,  పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ”.   ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని.  మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి.  ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి.  ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండి.  ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా..  వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. చంద్రబాబు  సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయండని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్