Sunday, September 8, 2024

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

- Advertisement -

జన సందోహంలో వేములవాడ దేవస్థానం

వేములవాడ

రాజన్న జిల్లా:ఫిబ్రవరి 12

రాజ‌న్న‌క్షేత్రం భ‌క్త‌జ‌న‌సందోహంతో కిట‌కిట‌లాడుతోంది. ఉద‌యం నుంచే రాజ‌న్న‌ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా చేరుకు న్నారు.

స్వామి వారిని ద‌ర్శించుకు నేందుకు ఆదివార‌మే రాత్రికి భ‌క్తులు క్షేత్రానికి చేరుకొని సోమ‌వారం ఉద‌యం స్నానాలు ఆచ‌రించి ఆల‌యానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

వేములవాడ రాజన్నభక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు అధికారులు రద్దు చేశారు. భక్తులకు లఘు దర్శనానికి అనుమతి ఇచ్చారు.

సమ్మక్క-సారలమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ.

వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే…సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళతారు జనాలు. ఈ తరుణంలోనే.. జనవరి మాసం నుంచే వేములవాడ రాజన్న క్షేత్రాని కి భక్తులు విపరీతంగా వస్తున్నారు.

 

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్