పాల్గోననున్న ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు
విజయవాడ: కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం మరియు నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ,కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై ఈనెల 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ ఎపి,తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారు లతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది.

ఈ అంశాలపై శనివారం ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో సమావేశంలో పాల్గోన్నారు. తెలంగాణా సిఎస్ శాంతి కుమారి ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారని కావున ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహింస్తామని అన్నారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు.అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు.



