Tuesday, May 19, 2026

భూమి పునరుద్ధరణ కోసం స్వచ్ఛంద కార్యాచరణ

- Advertisement -

భూమి పునరుద్ధరణ కోసం స్వచ్ఛంద కార్యాచరణ

Voluntary activity for land restoration

హైదరాబాదు, జనవరి 27
భూమి పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తూ, సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచే కార్యక్రమాన్ని ASEZ (A to Z Save the Earth) విశ్వవిద్యాలయ విద్యార్థుల స్వచ్ఛంద సమూహం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సంజీవయ్య పార్క్ వద్ద ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. దాదాపు 200 ASEZ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమై సరస్సు చుట్టుపక్కల శుభ్రపరిచారు. కాలేజీ విద్యార్థుల సమూహం పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను చాటిచెప్పింది.
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి  మాట్లాడుతూ, “యువతగా మీరు చేపట్టిన ఈ పర్యావరణ కార్యాచరణ గొప్పది, మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుండి మీకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్