అవినీతి అధికారుల భరతం పడతాం
ఏసీబీ డిఎస్పీ వీవీ రమణమూర్తి
జగిత్యాల
అవినీతి అధికారుల భరతం పడతామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వివి.రమణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన వారి పేర్లు నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చునని, వివరాలు చెప్పిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు. ఏ అధికారి అయినా లంచం అడిగిన ఇవ్వద్దని,
పని చేయ్యాయిని ఇబ్బంది పెడితే, వెంటనే తమకు తెలియజేయాలని సదరు అధికారులను ట్రాప్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవినీతి జరిగిన అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ వివి. రమణమూర్తి 9154388954, ఇన్స్పెక్టర్ రాము 9154388956, ఇన్స్పెక్టర్ తిరుపతి 9154388955, ఇన్స్పెక్టర్ రవీందర్ 9154388957 అధికారులను సంప్రదించవలసినదిగా ఆయన సూచించారు.



