Sunday, September 8, 2024

పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందేలా కృషి చేస్తాం

- Advertisement -

మంథనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీను బాబు

మంథని:  కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పధకాల గురించి దుద్దిల్ల శ్రీను బాబు ప్రజలకు వివరించారు.  విజయభేరి  భారి బహిరంగ సభలో సోనియా  గాంధీ  ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, కార్యక్రమాలు ప్రజలకు చాలా ఉపయోగపడే పథకాలు అన్నారు. మంథని  నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుదిల్ల శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను శ్రీను బాబు కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల,మున్సిపాలిటీ ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ అధ్యక్షులు పోలు శివ, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు పెంటరి రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్  బూడిద శంకర్, రామగిరి ఎంపిపి అరెల్లి దేవక్క,జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగ రావు, సింగారపు కిష్టయ్య,జిల్లా బిసి సెల్ అధ్యక్షులు గోటికారి కిషన్, డివిజన్ ఎస్సి సెల్ అధ్యక్షులు మంథని సత్యం, మండల బిసి సెల్ అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమిని గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ జడ్పీటీసీ మూల సరోజన రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్ల అనిల్,మాజీ సర్పంచ్ మంథని కర్ణకృష్ణ, దొరగొర్ల శ్రీనివాస్, సర్పంచ్ చెన్నావేనా సదానందం, ఎంపిటిసి పెండ్లి ప్రభాకర్ రెడ్డి, నూకల కమల్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ రేపాక శ్రీకాంత్,సూరయ్యపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు,నియోజకవర్గం అధ్యక్షులు కేక్కర్ల సందీప్,ఆరిఫ్ సయ్యద్, మహిళా నాయకులు వోడ్నాల ప్రవళిక, పోలు రజిత, మరుపాక నిహారిక, లింగం భాను, తాటికంటి రమక్క, అయేషా ఖాన్, మండల మరియు టౌన్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్