కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ముఖ్రం
జగిత్యాల,
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన బంధు ను విజయవంతం చేయాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముఖ్రం పిలుపునిచ్చారు.. ఈ మేరకు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ముఖ్రం భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రామిల్ల రాంబాబు లు కలిసి,సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈనెల 16 న కార్మికుల సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు..
ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు కిరణ్, మహేష్, దేవదాస్,రమేష్ ,రాములు,అతిక్,ధర్మయ్య , సమీర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



